ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్రాజ్కు కర్ణాటక ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. బెంగళూరు నగరంలో ఉన్న ఆయన ఓటును అధికారులు ఓటర్ల జాబితా నుండి అధికారికంగా తొలగించారు. ప్రకాష్ రాజ్ కి ఇప్పటికే దేశంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాలలో ఓట్లు ఉన్నాయనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం చట్టవిరుద్ధం కావడంతో బెంగళూరులోని ఓటును అధికారులు తొలగించారు.
Also Read : స్టార్ హీరోల నెక్స్ట్ లైనప్ ఏమిటి..?
తన ఓటును తొలగించడంపై నటుడు ప్రకాష్రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “నేను గతంలో ఇదే బెంగళూరు స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అలాంటిది ఇక్కడే ఉన్న నా ఓటును అధికారులు ఏ ప్రాతిపదికన తొలగిస్తారు? నా సొంత ఊరిలోనే నా ఓటును ఎలా తీసేస్తారు?” అంటూ ఆయన అధికారులను నిలదీస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : మరో మహిళా ఏఎస్సైని తొక్కుకుంటూ వెళ్లిన వైసీపీ మూక..!
నిబంధనల ప్రకారం ఒక పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలి. కానీ ప్రకాష్రాజ్కు బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో.. మొత్తం 4 చోట్ల ఓట్లు ఉన్నాయని గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితా పునఃసమీక్ష ప్రక్రియలో భాగంగా బెంగళూరు ఓటును తొలగించగా, దీనిపై ప్రకాష్ రాజ్ చట్టపరంగా ముందుకు వెళ్తారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

