Tuesday, July 28, 2026 02:09 AM
Tuesday, July 28, 2026 02:09 AM

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ.. అసెంబ్లీలో తీర్మానం..!

యువతను చట్టసభల్లోకి పెద్ద ఎత్తున తీసుకురావాలనే లక్ష్యంతో, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత సివిల్ సర్వెంట్లుగా, మేయర్లుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు, వారికి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని రేవంత్ ప్రశ్నించారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్లుగా నియమిస్తున్నా నియమిస్తున్న విషయాన్ని రేవంత్ గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఎందుకు అనుమతించకూడదని ప్రశ్నించారు.

దేశ జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న ‘జెన్-జీ’ తరం గొంతుక చట్టసభల్లో వినిపించాలన్న రేవంత్.. వారికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసే అవకాశాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వయోపరిమితి తగ్గింపు కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని సీఎం ప్రకటించారు. గతంలో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు రాజీవ్ గాంధీ తగ్గించారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ గుర్తుచేశారు. దేశంలో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం గుర్తుచేశారు.

ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధిపైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ నది అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై తుది నిర్ణయాలు రావాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ ఈ దేశానికి ప్రధాని. ఆయన గుజరాత్‌ను, తెలంగాణను వేర్వేరుగా చూడకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తరహాలోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని.. వికసిత భారత్ లక్ష్యంలో తెలంగాణ 10 శాతం వాటా అందించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు. అదే, రాజ్యసభ సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పోటీ చేయాలంటే కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. కనీస వయోపరిమిని తగ్గించాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యువత స్పష్టం చేసింది. ఓటు వేసి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఇచ్చినప్పుడు.. చట్టసభలో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొత్త తరం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

హైడ్రా కమిషనర్ ను...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.....

ఏపీలో స్థానిక సంస్థల...

ఆంధ్రప్రదేశ్‌ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌...

అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే...

సమకాలీన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలుగుదేశం...

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

పోల్స్