Wednesday, August 5, 2026 11:48 PM
Wednesday, August 5, 2026 11:48 PM

ఫ్యాన్స్ కు జక్కన్న షాక్.. అవన్నీ ఫేక్ అంటూ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. ఒక్కో న్యూస్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ శివారుల్లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించబోయే సినిమాకు సంబంధించి మొదటి ఈవెంట్ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. ఈ ఈవెంట్ లోనే సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పటికే సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించి వారి వారి పేర్లు అనౌన్స్ చేశారు.

Also Read : నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పాత్ర పై పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇలా ఒక్కొక్కటిగా సినిమాకు సంబంధించి హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. ఈ టైంలో సినిమా డైరెక్టర్ రాజమౌళి వీడియో రిలీజ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించబోయే ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ అని ప్రచారం జరుగుతోందని.. కానీ పాస్ లో ఉన్న వారికి మాత్రమే ఆ ఈవెంట్ అంటూ ప్రకటించారు. ఆన్లైన్ లో పాసులు అమ్ముతున్నారని మాట వాస్తవం కాదని.. అటువంటి రూమర్స్ నమ్మవద్దని ఫ్యాన్స్ ను కోరారు. ఈ భారీ ఈవెంట్ కు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేశారు రాజమౌళి.

Also Read : విశాఖలో ఐటి కంపెనీల జాతర

విజయవాడ వైపు నుంచి వచ్చేవారు ఎలా రావాలో, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు ఏ విధంగా రావాలో రాజమౌళి వివరించారు. ఉన్న అన్ని మార్గాలకు సంబంధించి వీడియోలను పొందుపరిచి.. అందుకు సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ పాస్ పై ఇచ్చామని.. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈవెంట్ విషయంలో జరిగే ప్రచారాలను నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఈవెంట్ జరిగే రోజు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు రాజమౌళి. ఇక ఈవెంట్ లో సినిమా టైటిల్ తో పాటుగా వీడియో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్