Thursday, September 17, 2026 09:42 PM
Thursday, September 17, 2026 09:42 PM

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.. పూరి, దోశ బంద్..!

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ సిలెండర్ ల కొరత నేపధ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది. కొరత లేదని కేంద్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, వాస్తవం మాత్రం మరోలా ఉందనే కథనాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. బుకింగ్ వ్యవధిని పెంచడం, అలాగే డెలివరీ టైం కూడా ఆలస్యం అవుతున్న నేపధ్యంలో, అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇక హోటల్స్ యాజమాన్యాల్లో కూడా ఆందోళన మొదలైంది.

Also Read : దానంకు క్లీన్ చిట్.. కేటీఆర్ ట్విట్..!

ఇదే టైంలో హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఉండే హాస్టల్స్ లో కూడా ఫుడ్ ను కుదించాయి యాజమాన్యాలు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. గ్యాస్ ఎక్కువగా వినియోగించే వంటలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గారే, పూరి, దోశ వంటి వంటలను క్యాన్సిల్ చేసారు. అలాగే అప్పడాలు, వేయించే కూరలు వంటివి కూడా హాస్టల్స్ లో క్యాన్సిల్ చేయడం గమనార్హం. అటు హోటల్స్ కూడా గ్యాస్ ఎక్కువగా ఖర్చు అయ్యే మెనూ తగ్గించాయి. ప్రముఖ హోటల్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

Also Read : ఏపీ క్యాబినెట్‌లో మార్పులు.. ఈసారి వారికే ఛాన్స్..!

వీటితో పాటుగా కాలేజి యాజమాన్యాలు, ఐటి కంపెనీలలోని క్యాంటిన్ లు కూడా చాయ్ సహా పలు వంటకాల విషయంలో తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సరఫరా మెరుగు అయ్యే వరకు ఇదే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక హోటల్స్, రెస్టారెంట్ లు కూడా ఇలాగే ఫాలో అవుతున్నట్లు సమాచారం. కీలక రెస్టారెంట్ లలో వంటలను తగ్గించేసారు. దానికి తోడు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మీల్స్ విషయంలో కూడా తగ్గించాయి యాజమాన్యాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్