Thursday, May 7, 2026 01:17 AM
Thursday, May 7, 2026 01:17 AM

అన్నతో సయోధ్య కుదిరినట్టే..?

గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిపోయారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న గులాబీ పార్టీలో కవిత వ్యవహారం కొందరికి బీపీ పెంచింది. కోపం ఎవరి మీదనో తెలియదు గాని కోపం మాత్రం తీవ్రంగా ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి. అలాంటి కవిత ఇప్పుడు సిట్ రైట్ అయినట్టు కనపడుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోని కొంత మంది నాయకులపై ఫైర్ అయిన కవిత.. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు.

Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్

గతంలో తండ్రి కేసీఆర్ వద్ద కొంతమంది దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన ఆమె.. వరుసగా జాగృతి పేరు మీద కార్యక్రమాలతో బీఆర్ ఎస్ లో హీట్ పెంచారు. కవిత తో టచ్ లోకి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలు.. మీ వెంటే నడుస్తామని ఆమెకు హామీ కూడా ఇచ్చారనే ప్రచారం సైతం జరిగింది. పార్టీ లో కవిత వ్యవహారం పై కేసీఆర్ వద్ద పంచాయితీ పెట్టారు కొందరు సీనియర్ నేతలు. అక్కడి నుంచి కవిత పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం అంటూ గతంలో ఊహాగానాలు కూడా వినిపించాయి.

Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?

కానీ రెండు రోజుల నుండి స్వరం మార్చిన కవిత.. నేను బీఆర్ ఎస్ పార్టీ లొనే ఉంటా …ఇది నా పార్టీ నేను ఎందుకు బయటకి పోతా అంటూ వ్యాఖ్యలు చేసారు. జాగృతి నేతలు ఎవరైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కేటీఆర్ అని కలిసి మాట్లాడుకోవచ్చు అంటూ తాజా వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం లో బీజేపీ అధ్యక్ష మార్పు జరిగిన తర్వాత రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చినట్టు గానే కనపడుతోంది. పార్టీ లో లుకలుకలు లేకుండా పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలకు అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్