Thursday, May 7, 2026 03:44 AM
Thursday, May 7, 2026 03:44 AM

తప్పంతా మీదే.. అధికారులపై బాబు ఫైర్…!

తిరుమలలో బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులతో దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీటీడీ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లపై చంద్రబాబు ఆసహనం వ్యక్తం చేసారు. టీటీడీ ఉన్నతాధికారులపై కూడా చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Also Read  :కార్యకర్తలతో జగనన్న.. మళ్లీ వాయిదా..!

శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరమన్న ఆయన ప్రమాద ఘటనకు కారకులపై జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేస్తున్నామని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట లో మృతి చెందిన 6 గురిని గుర్తించామని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు చంద్రబాబు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీరియస్ గా ఉన్న ఇరువురికి 5 లక్షల నగదు పాటు కోల్కొనేంతవరకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

Also Read  :ఎమ్మెల్యేలు జారిపోతారా..? కాచుకు కూర్చున్న బిజెపి…!

గాయాల పాలైన 32 మందికి రెండు లక్షల తక్షణ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ని సస్పెండ్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ ను బదిలీ బదిలీ చేస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అటు తిరుమలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. అధికారుల తీరుపై పవన్ మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్