Sunday, June 21, 2026 05:02 AM
Sunday, June 21, 2026 05:02 AM

పేడ పురుగులతో జాగ్రత్త.. ఏపీ సర్కార్ వార్నింగ్

దేశంలో నిత్యం ఏదోక వైరస్ కలవరపెడుతూనే ఉంది. కరోనా తర్వాత పలు వైరస్ లు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్క్రబ్ వైరస్ కలకలం రేపుతోంది. మరణాలు కూడా నమోదు కావడంతో వైరస్ వస్తే ప్రాణాలు పోతాయనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. దీనిపై కాసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : దేఖ్‌లేంగే సాలా అంటున్న పవన్..!

కొన్ని రోజులుగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్నాయని, ఈ ఏడాది 1566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా ఏటా శీతాకాలంలో వస్తుందని తెలిపారు. ఏటా కేసులు నమోదు అవుతాయని, ప్రాణాంతకం కాదని పేర్కొన్నారు. ఆందోళన అవసరం లేదని, అంతర్జాతీయ నిపుణులతో చర్చించామని, త్వరగా గుర్తిస్తే మందులున్నాయన్నారు. బ్యాక్టీరియా వల్లే మరణాలనడానికి లేదని, మరణాలకు పలు కారణాలు ఉన్నట్టుగా పేర్కొన్నారు.

Also Read : ఆ యంగ్ స్పీడ్ గన్ ఎక్కడ..? గంభీర్ మర్చిపోయాడా..?

ప్రతి గ్రామంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఉంటాయని, పేడ పురుగుల నుంచి స్క్రబ్ టైఫస్ వస్తుందన్నారు. 9 అనుమానిత మరణాలు నమోదైనట్లు గుర్తించామని, ల్యాబ్‌ల్లోనూ పరీక్షలకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. జ్వరం వస్తే వైద్యుడి వద్దకు వెళ్లి రక్త నమూనాలు ఇవ్వాలని సూచించారు. ఐదు నుంచి 20 రోజుల మధ్య వ్యాధి గురించి తెలుస్తుందని, వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలని హెచ్చరించారు. జీనం ల్యాబ్స్‌లో మరణాల విశ్లేషణ చేయిస్తున్నామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్