Wednesday, February 4, 2026 04:04 PM
Wednesday, February 4, 2026 04:04 PM

తిరుపతిలో తీవ్ర విషాదం..!

తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కి చేరింది. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.

Also Read : వారికి పదవులు లేవు.. లోకేష్ క్లారిటీ..!

శ్రీనివాస అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. తొక్కిసలాట ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూలైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.

Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?

నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే, ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

భక్తులను క్యూలైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్