Thursday, May 7, 2026 07:40 AM
Thursday, May 7, 2026 07:40 AM

తిరుపతిలో తీవ్ర విషాదం..!

తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కి చేరింది. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.

Also Read : వారికి పదవులు లేవు.. లోకేష్ క్లారిటీ..!

శ్రీనివాస అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. తొక్కిసలాట ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూలైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.

Also Read : ఫార్ములా ఈ రేస్ తో వైసీపీకి లింకులు..?

నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే, ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

భక్తులను క్యూలైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్