ఏపీ కేబినేట్ నేడు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు కేబినేట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also read : పదవుల భర్తీకి శుభం కార్డు ఎప్పుడు..?
తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపగా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. అదే విధంగా అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్ లో మంత్రులు చర్చించారు. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయగా ఎస్ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also read : సోషల్ మీడియా వినియోగంపై ఏపీ సర్కార్ వినూత్న క్యాంపెయిన్..
ఈ పెట్టుబడులు వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దీని వలన 2,400 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు.
Also read : ఏపీలో గేమ్ చేంజ్ చేయనున్న పవన్ కళ్యాణ్
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడులకు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో 2,381 మందికి ఉపాధి కలుగనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్లో చర్చ జరిగింది.