Wednesday, May 6, 2026 09:40 PM
Wednesday, May 6, 2026 09:40 PM

ఏపిలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కొరియా సంస్థలు

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. చెన్నైలోని కొరియా కాన్సులేట్ జనరల్ కిమ్ చాంగ్ యున్ తో పాటు కొరియన్ ఎక్సిమ్ (KEXIM) బ్యాంక్ ఈడీసీఎఫ్ ఆపరేషన్స్ డిపార్ట్ మెంట్-2 డైరెక్టర్ జనరల్ కెవిన్ చోయ్, కెక్సిమ్ బ్యాంక్ ఎన్డీఆర్వో ముఖ్య ప్రతినిధి జంగ్ వాన్ రియూ, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(KOICA) డైరెక్టర్ చాంగ్ వూ చాన్ బుధవారం సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.

Also Read : పరామర్శ సరే… సాయం ఏదీ సారు….!

పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు కెక్సిమ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా ఎగ్జిమ్ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ వివరించారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఈడీబీని పునరుద్ధరించామన్నారు. ఏపీ అభివృద్ధిలో కొరియా సంస్థలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్