Wednesday, February 4, 2026 10:26 PM
Wednesday, February 4, 2026 10:26 PM

విజయసాయి కి ఊహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల విషయంలో అక్కడి ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. చెరువులను, కాలవలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖమ్మం నగరంలో కూడా ఇప్పుడు ఆ డ్రైవ్ కొనసాగే అవకాశం కనపడుతోంది. త్వరలోనే ఖమ్మంలో కూడా భారీగా కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం కనపడుతోంది. దీనిపై ఇప్పుడు ముందు అడుగు పడినట్టే తెలుస్తోంది.

విశాఖ నగరంలో అక్రమ నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నీ మధ్య ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు… అవసరమైతే అక్రమ నిర్మాణాలను తొలగించడానికి హైడ్రా తరహా వ్యవస్థను తీసుకోస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన చెప్పినట్టుగానే భీమిలి లో అనధికార నిర్మాణల తొలగింపు కు రంగం సిద్ధం చేసారు అధికారులు.

Read Also : వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజీ?

రాజ్యసభ సభ్యుడు విజయసాయి కుమార్తె కు జీవిఎంసి నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసారు. దానిపై కోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలు ఆపి.. వాటిని తొలగించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అవ్యాన్ రియల్టర్స్ కు ఈనెల రెండో తేదీన నోటీసులు జారి చేసింది జీవిఎంసి. నోటీసులు అందిన 24 గంటల్లోగా అనధికార నిర్మాణం తొలగించాలని సూచనలు చేసి.. లేకుంటే తామే తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసారు అధికారులు. నేడు వాటిని కూల్చేసి ప్రక్రియ అధికారులు చేపట్టి విజయసాయి కి షాక్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్