Sunday, October 19, 2025 12:01 PM
Sunday, October 19, 2025 12:01 PM
roots

కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం యాభై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలే చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. వచ్చే వారం పది రోజుల్లో మరో నలభై నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులను మార్చిన చోట కేసీఆర్ మంచి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత ఇప్పటి వరకూ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఉపేక్షించిన జగన్.. ఇక ఉపేక్షించకూడదని మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందేననని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవులుగా ఐ ప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జుల మార్పుపై దృష్టి సారించారు. ఈ సారి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే బలమైన నేతలు ఉంటే.. వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి 11 నియోజకవర్గాల్లో ఇంచార్జుల్ని మార్చారు.

సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తున్న చోట్ల సీనియర్ నేతలు, గతంలో పోటీ చేసిన వారి కన్నా కొత్త వారికి అవకాశం కల్పించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇంచార్జుల్ని మార్చిన 11 నియోజకవర్గాల్లో పలువురు కొత్త ఇంచార్జులు ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్‌ కుమార్, చిలుకలూరిపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి నుంచి పాణెం హనిమిరెడ్డి, రేపల్లె నుంచి ఈపూరి గణేష్, గాజువాక నుంచి వరికూటి రామచంద్రరావుకు అవకాశం కల్పించారు. వీరు గతంలో పోటీ చేయలేదు. వీరికి క్లీన్ ఇమేజ్ ఉంటుందని.. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వీరు బ్యాలెన్స్ చేస్తారని భావిస్తున్నారు.

మంత్రి విడదల రజనీ ఈసారి చిలుకలూరిపేట నుంచి పోటీ చేయరని తేలిపోయింది మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను ఇంచార్జ్ గా నియమించారు. రజనీకి గుంటూరు పశ్చిమను కేటాయించారు. గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరు ఉంది. అక్కడ వైసీపీ టిక్కెట్ కోసం అరడజన్ మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన మద్దాలి గిరి కి ఈ సారి హ్యాండ్ ఇచ్చారు. పిరాయింపు సమయంలో టిక్కెట్ ఇస్తామని హామీ ఉన్నప్పటికీ ఆయనకు చాన్సివ్వడం లేదు. ఇలాగే లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఏసురత్నం వంటి నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ వారందర్నీ కాకండా విడదల రజనీకి కేటాయించారు. విడదల రజనీ భర్త రజక వర్గానికి చెందిన వారు. రజనీ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని ముదిాజ్ వర్గానికి చెందిన వారు. గుంటూరు పశ్చిమలో వారి ఓట్లు తక్కువే.అయినా మంత్రి రజనీకి ఎక్కడో చోట టిక్కెట్ ఇవ్వాలి కాబట్టి గుంటూరు పశ్చిమ కేటాయించారని అంటున్నారు.

ఇది ప్రారంభమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఇంచార్జుల్ని మార్చాలనుకున్న చోట శరవేగంగా మార్చేసి.. పనితీరున అంచనా వేయాలనుకుంటున్నారు. పరిస్థితుల్ని అంచనా వేసిన తర్వాత.. టిక్కెట్లను ఖరారు చేస్తారు. ఇంకా ఎక్కువ సమయం లేదని.. కేవలం రెండు నెలలే ఉన్నందున వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కనీసం యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి ఉందని.. నియోజవర్గాలు మార్చనున్నారని చెబుతున్నారు. అదే జరిగితే…వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్