Tuesday, August 18, 2026 05:05 PM
Tuesday, August 18, 2026 05:05 PM

భారత ధనికులు విదేశాల్లోనే సెటిల్ అవుతారా..?

భారత్ కు చెందిన అత్యంత సంపన్నులు ఇప్పుడు విదేశాల్లో శాశ్వత నివాసం లేదా పౌరసత్వం పొందడంపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. గతంలో కేవలం వ్యాపార విస్తరణ కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో విదేశాలకు వెళ్లే ధనిక కుటుంబాలు.. ఇప్పుడు తమ దీర్ఘకాలిక సంపద రక్షణ వ్యూహంలో భాగంగా విదేశీ రెసిడెన్సీని ఒక ముఖ్యమైన ఆస్తిగా భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పన్ను నిబంధనల్లో మార్పులు, కొవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠాల నేపథ్యంలో.. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా మారేందుకు ఒక ప్లాన్ బి సిద్ధం చేసుకోవడమే ఈ వలసల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ‘MyRCBI.com’ ఇన్వెస్ట్‌మెంట్ ఇమ్మిగ్రేషన్ సంస్థ వెల్లడించింది.

Also Read : జోగి రమేష్ రాజకీయ కెరీర్ క్లోజ్..?

రూ. 100 కోట్లకు పైగా విలువైన వ్యాపారాలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలు, ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు, మల్టీ-కోర్ల ప్యాకేజీలు అందుకుంటున్న కార్పొరేట్ ఉన్నతాధికారులు ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్ ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా అమెరికా, పోర్చుగల్, గ్రీస్, యూఏఈ మరియు కొన్ని కరేబియన్ దేశాల ప్రోగ్రామ్‌లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ‘EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్’కు భారతీయుల నుండి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విదేశీ నివాస హక్కుల వల్ల గ్లోబల్ మొబిలిటీ పెరగడంతో పాటు, తదుపరి తరానికి అంతర్జాతీయ విద్య, ఉపాధి అవకాశాలు మరింత సులభతరం అవుతాయని సంపన్న కుటుంబాలు భావిస్తున్నాయి.

Also Read : బీసీలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

ప్రస్తుతం చైనా, అమెరికా, టర్కీ దేశాలతో పాటు అంతర్జాతీయ పెట్టుబడి వలసల మార్కెట్‌లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పుడు మనదేశంలో కేవలం ముంబై, ఢిల్లీ నగరాలకే పరిమితమైన ఈ ట్రెండ్.. ఇప్పుడు గుజరాత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గుజరాత్‌కు చెందిన అనేకమంది యువ పారిశ్రామికవేత్తల వ్యాపారాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడంతో.. వారు తమ కుటుంబ భద్రత, పిల్లల భవిష్యత్తు మరియు ఆస్తుల నిర్వహణను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి భారత కుబేరులకు విదేశీ పౌరసత్వం లేదా రెసిడెన్సీ అనేది భారతదేశాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళడానికి కాదని, తమ భవిష్యత్తు అధ్యాయాన్ని ఎక్కడ ప్రారంభించాలో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ కోసమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్