Sunday, September 13, 2026 06:28 PM
Sunday, September 13, 2026 06:28 PM

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై సిజిపి సుదీర్ఘంగా, రాజీలేని రీతిలో చేసిన పవర్‌ఫుల్ పోరాటానికి ఈ రాజీనామాతో చారిత్రాత్మక విజయం లభించింది.

Also Read : సీమకు మరో బంపర్ ఆఫర్..!

నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌ తో సిజిపి గత వారం రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉధృతమైన ధర్నా నిర్వహిస్తోంది. పార్టీ శ్రేణులు, విద్యార్థుల అండతో సాగిన ఈ నిరసనలు ఢిల్లీ పీఠాన్ని కదిలించడమే కాకుండా దేశం మొత్తాన్ని ఆలోచింపజేశాయి. నిరసనల తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, రెండు సార్లు సిజిపి ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదని సిజిపి గట్టిగా పట్టుబట్టింది.

Also Read : కోడలిపై జోగి రమేష్‌ కుటుంబం గృహహింస

ఈ ఉత్కంఠకు తెర దించుతూ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు సిజిపి గడువు విధించింది. ఆ డెడ్‌లైన్‌ ముగియడానికి ముందే, దేశవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. విద్యార్థుల పక్షాన నిలబడి సిజిపి సాధించిన ఈ అఖండ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యూక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర విద్యా శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్