Sunday, September 13, 2026 11:33 PM
Sunday, September 13, 2026 11:33 PM

పులివెందులకి జగన్‌ గుడ్‌ బై..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌ రోడ్‌లో రాంగ్‌ టర్న్ తీసుకొని పతనం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్‌ సొంత సీటు పులివెందుల కూడా సేఫ్‌ జోన్‌లో లేదని వస్తున్న వార్తలతో.. వైసీపీ పరపతి ఎంతగా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు యాభై ఏళ్ల నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా నిలిచింది. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి, విజయమ్మ, జగన్‌.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నేతలు పులివెందులను అర్ద శతాబ్దం పాటు ఏలారు.

Also Read : పరారీలో తమ్మినేని.. పరుగో పరుగు..!

ప్రస్తుతం పులివెందుల ప్రాంతం వైసీపీ చేతుల్లో నుంచి జారిపోయిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్‌ కూడా రాలేదు. అంతకు ముందు ఐదేళ్ల వైసీపీ పాలనలో.. స్థానిక ఎమ్మెల్యే జగన్‌ సీఎంగా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. టూరిస్టులాగా ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తున్న జగన్‌.. ముందే సెలెక్ట్ చేసుకున్న కొంత మందిని కలిసి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతారు. లోకల్‌ లీడర్స్‌తో, సామాన్య ప్రజలతో.. పార్టీ నాయకత్వానికి కనెక్షన్‌ కనిపించడం లేదు.

గతంలో రాజశేఖరరెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలు చూసుకొనే సమయంలో.. పులివెందుల రాజకీయాలను వివేకానందరెడ్డి చక్కబెట్టే వారు. ఇప్పుడు ఆ బాధ్యతలు అవినాశ్‌రెడ్డి చేతికి వచ్చాయి. కానీ వివేకా తరహాలో అవినాశ్‌రెడ్డికి లోకల్‌ పాలిటిక్స్‌పై పట్టు దొరకడం లేదు. మరోవైపు దశాబ్దాల తరబడి వైఎస్ కుటుంబం అణివేతకు గురైన ప్రత్యర్ధులు ఇప్పుడు నిర్బయంగా.. వైసీపీని ఢీకొంటున్నారు. గతంలో వైఎస్ ఫ్యామిలీకి భయపడి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వర్గాలు.. వైసీపీ ఓటమి తర్వాత క్రియాశీలంగా మారాయి. భయంతో పులివెందుల పాలిటిక్స్‌ను శాసించిన రోజులు చరిత్రలో కలిసిపోయాయి.

Also Read : భారత బ్యాంకులపై యుద్ధం దెబ్బ.. అసలేం జరుగుతోంది..?

ఇలాంటి పరిస్థితుల్లో 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులకు బదులు.. జగన్‌ కొత్త సీటు వెతుక్కోవడం మంచిదని పొలిటికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంపై గురి పెట్టి వైనాట్ కుప్పం అంటూ రెచ్చిపోయారు. రెండేళ్లు తిరిగేసరికి సీన్‌ రివర్స్ అయిపోయి.. పులివెందుల నాట్‌ సేఫ్‌ అనుకొనే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నాయకులు పని చేయాలి. నాయకుడి కోసమే జనం ఉన్నారనుకొంటే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి పులివెందుల ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్