Friday, March 20, 2026 08:08 PM
Friday, March 20, 2026 08:08 PM

మదనపల్లె దహనం కేసులో సంచలన విషయాలు.. !

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసు ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సీఐడీ తాజాగా కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న మునితుకారాం, ఏ-4 గా ఉన్న మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం వీరికి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సీఐడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు.

Also Read : తగ్గని పిన్నెల్లి వాయిస్.. ఈ వార్నింగ్ ఎవరికి..?

ఇది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదం కాదని, అత్యంత కుట్రపూరితంగా, ప్రణాళికాబద్ధంగా ఫైళ్లను దహనం చేశారని సీఐడీ నిర్ధారించింది. వివాదాస్పద భూములకు సంబంధించిన కీలక పత్రాలు, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని భూ కేటాయింపుల ఫైళ్లను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన విచారణలో నిందితులు సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదని రిపోర్టులో వెల్లడించారు. అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు.

Also Read : అమెరికా మంత్రులను భయపెట్టిన డ్రోన్ లు..!

నిందితులు విచారణలో నోరు విప్పకపోవడంతో, వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిందితులను విచారిస్తేనే, ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు..? ఎవరి ఆదేశాల మేరకు ఫైళ్లను తగులబెట్టారు? అనే విషయాలు బయటకు వస్తాయని సీఐడీ భావిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం కాదని, భూ అక్రమాల ఆధారాలను ధ్వంసం చేసేందుకు 7 లీటర్ల ఇంజన్ ఆయిల్ ఉపయోగించి ఫైళ్లను దహనం చేసారని అధికారులు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

ఆస్తుల నిజం జగన్...

గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో...

తగ్గని పిన్నెల్లి వాయిస్.....

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన గుండ్లపాడు...

ఆళ్ల ప్లాన్ రివర్స్.....

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గత...

దెబ్బకు దారిలోకి వచ్చిన...

మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతోన్న...

పోల్స్