రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో ఎంట్రీ ఇస్తారో ఊహించడం కష్టమే. ఇందుకు ప్రస్తుత ఉదాహరణ వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్. దివంగత రంగా రాజకీయ వారసత్వం రెండు దశాబ్దాల నుంచి పెద్దగా ప్రభావం చూపని మాట వాస్తవం. అటు రంగా – రాధ మిత్ర మండలిలో విభేదాలు కూడా వాస్తవమే. రంగా కుమారుడు రాధ.. ఎప్పుడు ఏం చేస్తారో అర్ధం కాని ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ.. పదవుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా ఉంది.
Also Read : కోవా బన్ వలికి అండగా కూటమి..!
ఈ సమయంలో రాజ్యసభకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనే ప్రచారం సైతం జరిగింది. ఇలాంటి టైంలో ఆయన సోదరి ఆశ కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తాననే మాట చెప్పకపోయినా.. రంగా ఆశయాల కోసం పని చేస్తా అంటూ చెప్పారు. ప్రస్తుతం మళ్ళీ సైలెంట్ అయిన ఆమె.. త్వరలోనే కూటమిలోని ఏదోక పార్టీలో జాయిన్ కావొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమె టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె చేరితే మాత్రం.. ఆమెకు బెజవాడ మేయర్ పదవి కూడా ఇచ్చే ఛాన్స్ కనపడుతోంది.
Also Read : బ్రేకింగ్: టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ కపుల్
గత కార్పోరేషన్ ఎన్నికల్లో బెజవాడ మేయర్ పదవి మహిళకే ఇచ్చారు. ఇప్పుడు కూడా మహిళకే ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మాత్రం.. ఆశ కిరణ్ మేయర్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు. కాపు సామాజిక వర్గంలో చీలిక రాకుండా ఉండే విధంగా కూటమి అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే.. వంగవీటి అభిమానులు కూడా దూరం కావోద్దని ప్లాన్ చేస్తోంది. అందుకే ఆశ కిరణ్ కు మేయర్ పదవి ఇచ్చే ఆలోచన కూటమి పెద్దలు చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం వైసీపీకి కాపు సామాజిక వర్గం మెజారిటీ దూరమయ్యే ఛాన్స్ ఉంది.

