గత ఏడాది కాలంగా టి20 లలో భారత జట్టు ఆటను మార్చిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసుపత్రి నుండి విడుదలైనా సరే ఇప్పుడు అతని ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్తో జరిగే ముఖ్యమైన లీగ్ మ్యాచ్లో అతను పాల్గొనడంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అభిషేక్, అధిక జ్వరం, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. బుధవారం అతను ఢిల్లీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
Also Read : కేసీఆర్ అరెస్టుపై రేవంత్ క్లారిటీ..!
కానీ గురువారం, భారత జట్టుతో కలిసినా సరే నీరసంగా కనిపించాడు. దీనితో ప్రాక్టీస్ సెషన్ కు కూడా అతను హాజరు కాలేదు. కొలంబోలో ఈ మ్యాచ్ జరగనున్న నేపధ్యంలో.. అతను జట్టుతో కలిసి వెళ్తాడా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. అయితే దాదాపు 3 కేజీల బరువు తగ్గాడని టీం ఇండియా వర్గాలు అంటున్నాయి. అతనిపై నేడో రేపో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అతను ఆడకపోతే అతని స్థానంలో సంజు సామ్సన్ ఆడే ఛాన్స్ ఉంది. కానీ నమీబియాతో జరిగిన మ్యాచ్ లో అతను రాణించలేదు.
Also Read : బ్రేకింగ్: అరవ శ్రీధర్ అరెస్ట్..?
కివీస్ తో జరిగిన 5 టి20 ల సీరీస్ లో కూడా అతను ఆకట్టుకోలేదు. దీనితో ప్రపంచకప్ లో అతని స్థానంపై కాస్త అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ పాక్ తో మ్యాచ్ లో అతనికి ఛాన్స్ వస్తే మాత్రం రాణించాల్సి ఉంది. అటు టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. రింకు సింగ్ ను పక్కన పెట్టాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. శివం దూబే స్థానంలో సుందర్ ను ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

