Saturday, August 22, 2026 02:01 PM
Saturday, August 22, 2026 02:01 PM

లోకేష్ డిన్నర్ మీట్.. మంత్రి గారి కొత్త సాంప్రదాయం..!

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి.. నాయకులతో మమేకం కావాలి. ప్రజా సమస్యలే కాదు నాయకుల సమస్యలు కూడా తెలుసుకుని అడుగులు వేయాలి. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ముందు నుంచి దూకుడుగానే ఉంటున్నారనే మాట వినపడుతోంది. తాజాగా లోకేష్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం అవుతోంది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నాయకులకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో లోకేష్ కీలక అడుగులు వేస్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం మాట్లాడతారో వింటా..!

చాలా మంది ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి, నియోజకవర్గాల సమస్యలు సహా అనేక విషయాలపై కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్న నేపధ్యంలో వాటిని తెలుసుకుని అడుగులు వేయాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుడుతున్నారు. నాయకులకు టైం ఇవ్వడం లేదనే విమర్శకు చెక్ పెట్టడమే కాదు నాయకత్వానికి భరోసా ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

Also Read : జగన్ కు చెన్నకేశవ రెడ్డి ఎలివేషన్.. నిరాశపరిచిన అన్న..!

బడ్జెట్ సమావేశాల వేళ రోజుకో పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులతో డిన్నర్ సమావేశాలు నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. నేతల యోగక్షేమాలు, సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు దిశా నిర్దేశాలు చేయనున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అడగడం, ఏయే శాఖల్లో సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం వంటివి లోకేష్ చేస్తారు. నేతల మధ్య గ్యాప్ ఉంటే దానికి పరిష్కారాలు చూపనున్నారు లోకేష్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

సాయి రెడ్డితో రాజీ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

పోల్స్