తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బిజెపి ఏ విధంగా ఇక్కడ రాజకీయం చేస్తాయి అనేది ఆసక్తిని పెంచుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ శ్రేణులను యాక్టివ్ చేయగా.. బిజెపి విషయంలో మాత్రం ఏం జరుగుతుందా అనేది స్పష్టత రావడం లేదు. తెలంగాణాలో.. ఎన్డియే ఏపీ ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ దీనిపై బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకత్వం క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?
ఇక జనసేన పార్టీ ఇటీవల.. తెలంగాణాలో పోటీ చేస్తామని ప్రకటన చేసింది. ఇక టీడీపీ పరిస్థితి ఏంటీ అనేది క్లారిటీ రాలేదు. ఈ టైం లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో భేటీ కావడంతో.. తెలంగాణా డ్రాప్ అయిపోతుందా అనే ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు మరో కీలక ప్రకటన వచ్చింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్కల్యాణ్ పాల్గొంటారు అంటూ ప్రకటన చేసారు. ఈనెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేస్తారు. బిజెపి ఈ విషయాన్ని ఖరారు చేసింది.
Also Read : ముంబై అండర్ వరల్డ్ లో హిందూ డాన్ ఎంట్రీ..?
రాత్రి పవన్ను కలిసిన కిషన్ రెడ్డి, రాంచందర్రావు.. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో రాంచందర్రావు మద్దతు కోరగా.. పవన్ అంగీకారం తెలిపారు. బీజేపీ, జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ జనసేన ట్వీట్ చేసింది. ఇక పవన్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో టీడీపీకి కొంత బలం ఉన్న సంగతి తెలిసిందే.

