Wednesday, August 5, 2026 08:49 PM
Wednesday, August 5, 2026 08:49 PM

కాశ్మీర్ లో తెలుగోడి సత్తా.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసర్..!

ఒకవైపు భద్రత బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్న సరే.. చాప కింద నీరుల విస్తరిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై భద్రత బలగాలు దృష్టి సారించాయి. పాకిస్తాన్ ప్రోద్బలంతో దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. కాశ్మీర్ లోయలోని సరిహద్దు గ్రామాల్లో ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తోంది. అనుమానం వచ్చిన వాళ్లను అరెస్టులు చేసి ప్రశ్నిస్తోంది.

Also Read : ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ప్రవీణ్ ప్రకాష్.. షాక్ లో అధికార వర్గాలు

ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు ఆర్మీ అధికారి చూపించిన చొరవ ప్రశంసలు అందుకుంటుంది. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టడంలో ఆ అధికారి అందించిన క్లూ ఎంతో కీలకంగా మారింది. అసలు ఏంటి ఆ క్లూ అనేది ఒకసారి చూద్దాం. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఒక కుట్రను అధికారులు చేదించారు. ఈ కేసులో మొదటి లీడ్ ఇచ్చింది కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి అనే ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించింది సందీప్ చక్రవర్తినే. పోస్టర్లు అంటించిన వారిని సిసి కెమెరాలు ద్వారా గుర్తించారు సందీప్. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. ముగ్గురు నిందితులు సోఫియాన్, ఇర్ఫాన్, అహ్మదులను అరెస్టు చేసి రెండు వారాలపాటు సందీప్ చక్రవర్తి విచారించారు. వాళ్ళు ఇచ్చిన పక్కా సమాచారం తోనే డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్ ప్లాన్ బయటికి వచ్చింది. దీనితో ఆర్మీ వర్గాల్లో సందీప్ చక్రవర్తి పేరు మార్మోగిపోతోంది. అటు ఉగ్రవాదులకు కూడా సందీప్ కొరకరాని కొయ్యగా మారారు. ఆర్మీలోని ఉన్నతాధికారులకు కూడా సందీప్ నమ్మకమైన అధికారిక గుర్తింపు పొందారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్