Saturday, September 19, 2026 10:13 PM
Saturday, September 19, 2026 10:13 PM

టీడీపీ మహిళా ఎమ్మెల్యే సంచలనం.. చంద్రబాబును కూడా లెక్క చేయడం లేదా..?

సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలను లెక్కచేయరు అనే మాట మనం వింటూనే ఉంటాం. ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలను కూరలో కరివేపాకు మాదిరి తీసేస్తూ ఉంటారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అప్పుడప్పుడు ప్రచారం చూస్తూనే ఉంటాం. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను అధికారులు లెక్కచేయకపోవడం.. కనీసం పంపించిన వినతి పత్రాలను కూడా అధికారులు పట్టించుకోకపోవడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎమ్మెల్యేలను పెద్దగా లెక్కచేయని అధికారులు కొన్ని సందర్భాల్లో మంత్రులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు.

Also Read : తిరుమల లడ్డు కేసులో వెలుగులోకి పాపాలు..!

తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అధికారులు తీరుపై మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవి. తనకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తుఫాను బాధితులకు సహాయం విషయం కూడా తనకు తెలియదని అదేవిధంగా అధికారులు తీరు విభజించి పాలించే తరహాలో ఉందని.. అసలు అధికారులది అహంకారమా లేదంటే అమాయకత్వమా తనకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : రోహిత్ పెళ్లిలో అంతా తానైన చంద్రబాబు.. మరి జూనియర్ ఎక్కడ?

ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలను పెట్టకపోవడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సామాన్యులకు పనులయ్యే పరిస్థితి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం లేదని మండిపడ్డారు. అధికారుల దగ్గర్నుంచి సమాధానం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపిన మాధవి.. ఈ అంశాలను ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా మంత్రుల విషయంలో కూడా కొంతమంది ఉన్నతాధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు అనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్