Friday, September 12, 2025 06:47 PM
Friday, September 12, 2025 06:47 PM
roots

ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కార్యక్రమాలతో పెద్ద సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ సంస్థలను కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దీనితో సాహసం చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

Also Read : నిజంగానే చంద్రబాబు పగ తీర్చుకున్నారా..?

ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉండటంతో రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఆసక్తికర కామెంట్ చేశారు. స్పీక్ ఎనీ లాంగ్వేజ్, వేర్ ఎనీ క్లాత్స్, ఈట్ ఎనీ ఫుడ్ అంటూ లోకేష్ ఓ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ చూసిన జాతీయ మీడియా ఫిదా అయిపోయింది. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భాష విషయంలో ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. ఓ రాష్ట్రంలో తమ భాష మాట్లాడాలి అంటూ అక్కడ బతికే వారిని కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు చూసాం. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా హిందీ పై మమకారంతో కాస్త హడావుడి చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏ భాషైనా మాట్లాడొచ్చని.. ఏ దుస్తులైనా వేసుకోవచ్చని.. అంటే ఏ సాంప్రదాయాలైనా పాటించవచ్చని, ఇక తమకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు అంటూ లోకేష్ చెప్పడం చాలామందికి నచ్చేసింది.

Also Read : ముంచేసిన మిథున్ రెడ్డి.. జగన్ పని అయిపోయినట్లే

ప్రముఖ సోషల్ మీడియా పేజీల్లో సైతం ఈ కామెంట్ ను వైరల్ చేస్తున్నారు. ఈ తరహా కామెంట్ ఇప్పటివరకు ఏ రాష్ట్ర మంత్రి చేయలేదు. తమ రాష్ట్రంలో ఎంత స్నేహపూర్వక వాతావరణం ఉందో చెప్పేందుకు లోకేష్ ఆ పదాలను వాడారు. పెట్టుబడులు పెట్టే వారికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అని చెప్పడానికి ఎక్కువ సాగదీయకుండా సింపుల్ గా క్లోజ్ చేశారు లోకేష్. న్యూట్రల్ గా ఉండే ప్రముఖ సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఓ చర్చ కూడా జరుగుతుంది. లోకేష్ లో తక్కువ అంచనా వేసిన వైసిపి సోషల్ మీడియా కూడా ఈ విషయంలో అభినందించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్