గుర్గావ్లో జూలై 10న జరిగిన దారుణ ఘటనలో రాధిక యాదవ్ అనే యువ టెన్నిస్ క్రీడాకారిణి తన తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. తల్లి పుట్టినరోజున, ఆమె కోసం స్పెషల్గా వంటకం చేస్తున్న సమయంలో రాధికను ఆమె తండ్రి వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వార్త చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె అకాల మరణం తర్వాత, నటుడు అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడైనా ఒక కూతురు ఉంటే, ఆమె కూడా ఆమెలాగే సాధించాలని కోరుకుంటున్నానని అడవి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
Also Read : బావా, బామ్మర్దులుగా బాలయ్య, వెంకటేష్..!
“ప్రియమైన రాధిక, నాకు ఎప్పుడైనా ఒక కూతురు ఉంటే, ఆమె కూడా మీలాగే సాధించి విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. మేము మీ పట్ల చాలా గర్వంగా ఉండాలి. రెస్ట్ ఇన్ పీస్. ఓం శాంతి” అని పోస్ట్ చేశారు. రాధిక యాదవ్కు మద్దతుగా గొంతు విప్పిన కొద్దిమంది ప్రముఖులలో అడవి శేష్ ఒకరు.
https://x.com/AdiviSesh/status/1943573973448446441
గురుగ్రామ్ పోలీసులు మాట్లాడుతూ, రాధిక టెన్నిస్ అకాడమీని నడుపుతోందని, దానిని ఆమె తండ్రి వ్యతిరేకించారని చెప్పారు. “పోలీస్ బృందాలు సంఘటనా స్థలాన్ని సందర్శించాయి. మృతురాలు టెన్నిస్ అకాడమీని నిర్వహించడమే ఈ నేరానికి కారణం, మరియు ఆమె తండ్రి దానిని వ్యతిరేకించారు” అని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా రాధిక గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక అకాడమీని స్థాపించి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేది. అయితే కూతురు సంపాదనతో జీవిస్తున్నానని కొందరు గ్రామస్థులు తనను హేళన చేశారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక చంపేశానని తండ్రి దీపక్ ఒప్పుకున్నాడు. అకాడమీ మూసివేయాలని ఆమెకు పలుమార్లు చెప్పిన వినలేదన్నారు.
Also Read : స్టార్ హీరోయిన్ ను నిండా ముంచిన పర్సనల్ అసిస్టెంట్
ఆమె మ్యూజిక్ వీడియోలో కనిపించడం, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండడం ఇంట్లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఆమె నటించిన “కార్వాన్” అనే మ్యూజిక్ వీడియోను ఒక సంవత్సరం క్రితం విడుదల చేశారు. ఈ మ్యూజిక్ వీడియోలో రాధిక కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. రెండేళ్ల క్రితం తగిలిన గాయం కారణంగా టెన్నిస్ కెరీర్కు దూరంగా ఉన్న రాధిక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని ఆకాంక్షించింది. ఆమె తరచుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ను సృష్టించి అప్లోడ్ చేసేది అని పోలీసు వర్గాలు తెలిపాయి. దీపక్ తన కూతురు సోషల్ మీడియాలో ఉండటం పట్ల కలత చెందాడు. రీల్స్ తొలగించమని కూడా ఆమెను కోరాడు. కూతురి సంపాదన మీద ఆధారపడ్డావ్ అని తనను గ్రామస్థులు అవమానించడంతో ఈ దారుణానికి ఒడిగట్టానని ఆమె తండ్రి చెప్పాడు.
Also Read : పవన్.. ప్రశ్నించడం మర్చిపోయావా?
రాధిక మార్చి 23, 2000న జన్మించారు. ఆమె వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) రికార్డుల ప్రకారం బాలికల అండర్-18లో 75వ స్థానం, మహిళల డబుల్స్లో 53వ స్థానం మరియు మహిళల సింగిల్స్లో 35వ స్థానంతో కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సాధించింది.