భారత జట్టు విదేశీ పర్యటనలు అనగానే.. జట్టు ఎంపికపై కాస్త ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో భారత్ పర్యటిస్తుంటే మాత్రం జట్టు ఎంపిక అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాట్స్మెన్ కూడా స్వింగ్ ను ఫేస్ ను తట్టుకొని నిలబడాలి. ఐదు రోజుల ఆటలో వీళ్లే అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లు.. జట్టు నుంచి వైదొలిగిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ పర్యటనలో ఎవరిని ఎంపిక చేయవచ్చు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : క్రికెట్ ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్.. మరో ప్లేయర్ రిటైర్..?
ఈ తరుణంలో సాయి సుదర్శన్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్లో 617 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక తాజాగా అతను చేసిన సెంచరీలో కొట్టిన సిక్సులు, ఫోర్లు పూర్తి క్లాస్ ఇన్నింగ్స్. అది చూసిన అభిమానులు అతని ఆట టెస్ట్ క్రికెట్ కు, సరిపోతుందని కాబట్టి అతనిని తీసుకోవాలని కోరుతున్నారు. ఇంగ్లాండ్ లో కౌంటి మ్యాచులు ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. కాబట్టి సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళితే ఖచ్చితంగా భారత జట్టుకు పర్ఫెక్ట్ ఓపెనర్ దొరికినట్లే.
Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!
రోహిత్ శర్మ స్థానాన్ని అతనితో భర్తీ చేయవచ్చు అని భావిస్తున్నారు. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సాయి సుదర్శన్ అవసరమైతే 4వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు. మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే ఖచ్చితంగా అది జట్టుకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓపెనర్ గా జైస్వాల్ జైష్వాల్ ఉన్నాడు.. కాబట్టి ఇతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించినా జట్టుకు ప్రయోజనం ఉంటుంది.

