Friday, September 12, 2025 08:55 PM
Friday, September 12, 2025 08:55 PM
roots

ఆరోగ్యానికి వరం బొప్పాయి.. అయితే ఇలా తింటే ప్రమాదమే

బొప్పొయి ఒక ఆరోగ్యకరమైన పండు. ఇది తేలికగా జీర్ణమయ్యే పండు కావడంతో పాటు ఎన్నో పోషకగుణాలు కలిగి ఉంటుంది. దీనిని “అర్జున ఫలం” అని కూడా పిలుస్తారు. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బొప్పొయి తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను చూద్దాం.

Also Read : క్యాబినెట్ విస్తరణ.. అది జరిగినప్పుడు చూద్దాం..!

1. జీర్ణక్రియకు తోడ్పాటు : 

బొప్పొయిలో పాపైన్ అనే ఎన్జైమ్ ఉండటం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అజీర్నం, గ్యాస్, అమ్మిబ్లిక్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

2. మలబద్ధకానికి నివారణ : 

బొప్పొయిలో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పొయి పండు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. మలబద్దకం తగ్గడంతో పాటు శరీర బరువుని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది.

Also Read : జగన్‌కు పోలీసు దెబ్బ రుచి తప్పదా..!

3. చర్మ ఆరోగ్యానికి మంచిది :

బొప్పొయిలో విటమిన్ A, C మరియు E ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గేందుకు సహాయపడుతుంది. పప్పాయ గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసినా చర్మంపై మంచి ప్రభావం చూపుతుంది. చర్మ సౌందర్యం మెరుగుపడటంతో పాటు చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది.

4. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది :

బొప్పొయిలో విటమిన్ C అధికంగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

Also Read : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చనున్న లోకేష్

5. హృదయ ఆరోగ్యానికి మేలు :

బొప్పొయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు పొటాషియం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి హృదయానికి మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు పరకడుపున బొప్పాయి పండు తిన్న వాళ్ళు బరువు తగ్గినట్లు నిపుణులు తెలియచేస్తున్నారు.

6. కళ్లకు ఆరోగ్యం : 

బొప్పొయిలో విటమిన్ A పుష్కలంగా ఉండటంతో కంటి చూపు మెరుగుపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే చూపు సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Also Read : కసిరెడ్డిని దేశం దాటించిన ఐపిఎస్

బొప్పొయి తినడం ద్వారా శరీరానికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. రోజూ కొంతమేర తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అధికంగా తినకుండా మితంగా తీసుకోవాలి. అయితే గర్భిణులు ముదిరిని పప్పాయ తినకూడదు. ఇందులో ఉండే పెపైన్ అనే రసాయనం గర్భాన్ని ప్రభావితం చేయొచ్చు. ఎక్కువగా తింటే జీర్ణక్రియ పై ఒత్తిడి రావచ్చు. పండిన పప్పాయను మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనం. బొప్పాయి పండును వీలైనంత వ‌ర‌కు ఉదయం పూట మాత్రమే తినండి. రాత్రి వేళ బొప్పాయి తిన‌డం స‌రైన నిర్ణయం కాదు.రాత్రి పూట బొప్పాయి తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు నొప్పి వంటివి త‌లెత్త‌వ‌చ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్