Wednesday, August 5, 2026 09:26 PM
Wednesday, August 5, 2026 09:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. టిడిపి, జనసేన, బిజెపి నుంచి చాలామంది ఆశావాహులు ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా లిస్టులో ఐదుగురు ప్రముఖంగా వినపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా వినపడుతున్న పేరు వంగవీటి రాధ. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని స్వయంగా నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

Also Read : ఏపీ వద్దు.. యానం ముద్దు..!

గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా వంగవీటి రాధకు నారా లోకేష్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారట. ఇక పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు ప్రముఖంగా వినపడుతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. దీనితో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనితో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. ఇక మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేరు కూడా వినపడుతోంది. అలాగే జనసేన పార్టీ నుంచి నాగబాబు పేరు ప్రధానంగా చర్చల్లో ఉంది.

Also Read : తెలుగోళ్ళ తమిళ పిచ్చి.. ఆ డైరెక్టర్ల వెంట పడుతున్నారా…?

నాగబాబును ఎమ్మెల్సీ చేసీ కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నాగబాబు ఇప్పటికే క్యాబినెట్ లోకి అడుగుపెడతారని తెలుగుదేశం పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ చేయడం దాదాపు ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇక బిజెపి నుంచి మాధవ్ పేరు కూడా వినపడుతోంది. ఇలా ఐదుగురు నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ముఖ్యంగా వంగవీటి రాధా, నాగబాబు పేర్లు దాదాపుగా ఖరారు అయినట్లుగానే కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్