Wednesday, February 4, 2026 10:01 PM
Wednesday, February 4, 2026 10:01 PM

వైసీపీలో 14 రోజుల భయం.. వంశీ ఇప్పట్లో కష్టమే..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైసిపి నేతలకు.. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే భయం పట్టుకుంది. ఆ పార్టీ నేతలు రిమాండ్ కు వెళ్లి ఎప్పుడొస్తారో అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. రాజకీయంగా వైసిపి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో పార్టీ నేతలు ఒక్కొక్కరిని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇటీవల కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మాజీ మంత్రులకు రూట్ మ్యాప్

ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో అర్థం కాక పార్టీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. వాస్తవానికి 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లిన వాళ్ళు తిరిగి బయటకు రావడం చాలా కష్టమైపోతుంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అలాగే వైసిపి తరఫున సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే బోరుగడ్డ అనిల్ కుమార్… కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇలా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. నందిగం సురేష్ ఇటీవల బెయిల్ పై బయటికి వచ్చారు.

Also Read : థమన్ కి ప్రేమతో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలల తర్వాత విడుదలయ్యారు. దీనితో పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోని వైయస్ జగన్ ఇక నుంచి పార్టీ తరఫున నేతలకు, కార్యకర్తలకు న్యాయ సహాయాన్ని అందించాలని.. తమ పార్టీ న్యాయవిభాగానికి ఇప్పటికే సూచనలు చేశారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట వైసిపి కార్యకర్తలకు, అధిష్టానానికి చుక్కలు చూపిస్తోంది. ఇక వంశీ విషయంలో ఇప్పటికే పలు కేసులను కూడా బయటకు తీసేందుకు కృష్ణాజిల్లా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఆయనపై నమోదైన పలు కేసుల్లో పిటి వారెంట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్