Saturday, September 19, 2026 08:17 PM
Saturday, September 19, 2026 08:17 PM

అల్లు అర్జున్ ను వదలని తెలంగాణా పోలీస్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ విషయంలో తెలంగాణా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు… బెయిల్ రద్దు చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కు బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తోంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్‌పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Also Read : కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు నేతలు

గత విచారణలో కౌంటర్‌కి సమయం కోరిన పోలీసులు… నేడు కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో బయట ఉన్న అల్లు అర్జున్.. తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని పిటీషన్ దాఖలు చేసారు. రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణ కు వర్చువల్‌గా అల్లు అర్జున్ హాజరు అయ్యాడు. తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది కోర్ట్. ఈనెల 4 న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : బాలయ్య కోసం ఎన్టీఆర్.. నాగ వంశీ ప్లానింగ్

13 న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో.. అంతకుముందే హై కోర్టు లో అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగింది. అదే రోజు నాలుగు వారాల సమయంతో మధ్యంతర బెయిల్ ను హై కోర్టు మంజూరు చేసింది చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత జనవరి 10న విచారణ జరగనుంది. ఇక ఈ కేసులో మరొకరిని కూడా చేర్చారు పోలీసులు. మైత్రీ మూవీ మేకర్స్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్