Wednesday, August 5, 2026 11:00 AM
Wednesday, August 5, 2026 11:00 AM

జగన్ చేతుల్లోంచి జారిపోతున్న సొంత జిల్లా

ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దూకుడు రాజకీయం చేస్తోంది. కూటమిలో ఇతర పార్టీలతో సంబంధం లేకుండా కొన్ని రాజకీయ లక్ష్యాల విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వరుసగా మున్సిపాలిటీలను కైవసం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇటీవల కొన్ని కీలక మున్సిపాలిటీల మీద దృష్టి పెట్టి వాటిని టీడీపీ దాదాపుగా కైవసం చేసుకుంది అనే చెప్పాలి. రాయలసీమ జిల్లాల మీద కూడా టీడీపీ దృష్టి సారించింది. వైజాగ్ ని కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Kadapa MLA Reddeppagari Madhavi Reddy

అలాగే జిల్లా పరిషత్ ల మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టారని వైసీపీలో కలవరం మొదలయింది. ముఖ్యంగా కడప కర్నూలు జిల్లాల మీద చంద్రబాబు దృష్టి పెట్టారనే ఆందోళన వైసీపీ నేతల్లో ఎక్కువగా నెలకొంది. కడప మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవి వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్కడ కొందరు కార్పొరేటర్లు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె భావిస్తున్నారు. వారిని ఎలా అయినా కట్టడి చేయాలని మాధవి ఇప్పుడు వ్యూహం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే పులివెందుల మీద కూడా దృష్టి పెట్టారట. వైఎస్ జగన్ కి పక్కలో బల్లెం లాగా బిటెక్ రవి అక్కడ రాజకీయాలు చేస్తున్నారు.

YS Jagan Mohan Reddy

ఇదిలా ఉంచితే కడప జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వైఎస్‌ జగన్‌తో కడప జిల్లా జడ్పీటీసీలు ఈరోజు తాడేపల్లిలో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. జడ్పీ చైర్మన్ పీఠం విషయంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో పలువురు జడ్పిటిసిలు టిడిపి వైపు చూస్తున్నారని ప్రచారంతో అప్రమత్తమైన జగన్… వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సొంత జిల్లాలో జడ్పీ చైర్మన్ కాపాడుకోవడం కోసం వైసీపీ అధినేత నాయకులతో సమావేశం అయ్యారు. ఈ స్థానం కోల్పోతే పార్టీ జిల్లాలో మరింత బలహీన పడుతుంది అనే ఆందోళన ఆయన నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్