Wednesday, August 5, 2026 11:08 AM
Wednesday, August 5, 2026 11:08 AM

కోడెలకు అండగా నిలిచాననే జగన్ దూరం పెట్టారు: రఘురామ

రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రియాక్ట్ అయ్యారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామన్నారు. రతన్ టాటా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని గొప్ప మానవతావాదని అభివర్ణించారు రఘురామకృష్ణంరాజు.

Also Read : బాబు సంతకంతో జగన్ సైలెంట్..!

విద్య వైద్యం తో పాటుగా అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు వెలకట్టలేని అని ఆయన కొనియాడారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని అందరి కోరిక అన్నారు రఘురామ. ఈ విషయంపై తాను నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని.. అవార్డు ఇచ్చిన లేకపోయినా ఆయన భారతీయుల హృదయాల్లో రత్నమేనని కొనియాడారు. జగన్ తనను దూరం పెట్టడానికి గల కారణాన్ని రఘురామకృష్ణం రాజు బయటపెట్టారు.

Also Read : సాయిరెడ్డితో వైసీపీ రాజీ కష్టాలు

దివంగత టిడిపి నేత కోడెల శివప్రసాదరావుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న రఘురామకృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ హయాంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ పై వైసీపీ నాయకులు చిల్లరి మాటలు మాట్లాడుతుంటే వాటిని సహించలేకపోయాను అని అన్నారు. తాను వ్యతిరేకించడంతోనే జగన్ తనను పక్కన పెట్టారని రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాద్ ను కావాలనే అప్పట్లో వైసీపీ వేధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని పత్రికలు కావాలనే విషం చిమ్ముతున్నాయన్నారు రఘురామ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్