Wednesday, August 5, 2026 03:55 PM
Wednesday, August 5, 2026 03:55 PM

రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై.. తపాలా శాఖ కీలక నిర్ణయం..!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న సర్వీసులు కనుమరుగు అవుతున్నాయి. తాజాగా మరో ఐకానిక్ సర్వీస్ కనుమరుగు అయ్యే దశలో ఉంది. భారత తపాల శాఖ కీలక ప్రకటన చేసింది. తమ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 50 ఏళ్ళ శకానికి ముగింపు పలికింది. సెప్టెంబర్ 1, 2025 నుండి, తమ కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్‌ ను అప్డేట్ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా దశల వారీగా రిజిస్టర్డ్ పోస్ట్ ను తొలగిస్తారు.

Also Read : బిగ్ బాస్ అరెస్టు ఖాయమా..?

50 సంవత్సరాలకు పైగా అత్యంత నమ్మకమైన సర్వీస్ గా దీనికి గుర్తింపు ఉంది. లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగుల ఆఫర్ లెటర్ లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు వంటి ముఖ్యమైన పత్రాలను అందించడానికి ఈ సర్వీసును వాడుకోవచ్చు. 2011-12లో 244.4 మిలియన్ల రిజిస్టర్డ్ పోస్ట్ లు పంపగా.. క్రమంగా తగ్గుతూ వచ్చింది. 25% తగ్గి.. 2019-20లో 184.6 మిలియన్లకు తగ్గిందని భారత తపాలా శాఖ ప్రకటించింది. డిజిటల్ గా పత్రాలు పంపడం, ప్రైవేట్ కొరియర్లు, ఇ-కామర్స్ లాజిస్టిక్స్ నుండి పోటీ కారణంగా రిజిస్టర్డ్ పోస్ట్ ఇబ్బంది పడింది.

Also Read : మెగా ఫ్యామిలీకి గడ్డు కాలమే..?

దీనిని స్పీడ్ పోస్ట్ తో విలీనం చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 1 నాటికి అన్ని శాఖలు, కోర్టులు, విద్యా సంస్థలు, వినియోగదారులు కొత్త వ్యవస్థకు మారాలని పోస్టల్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సూచించారు. 1986 నుండి పనిచేస్తున్న స్పీడ్ పోస్ట్ కింద సేవలను ఏకీకృతం చేయడం ద్వారా ట్రాకింగ్ ఖచ్చితత్వం, డెలివరీ వేగం వంటి సౌకర్యాలను మెరుగు పరచడానికి అయితే, స్పీడ్ పోస్ట్ కాస్త రేట్ ఎక్కువ. రిజిస్టర్డ్ పోస్ట్ ప్రారంభ రేట్.. 200 గ్రాములకు రూ. 25.96 ప్లస్ రూ. 5 కాగా, స్పీడ్ పోస్ట్ 50 గ్రాముల నుంచి రూ. 41తో ప్రారంభమవుతుంది. అందుకే గ్రామీణ భారతంలో ఎక్కువగా రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే వాడుతూ ఉంటారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్