Sunday, September 20, 2026 02:28 AM
Sunday, September 20, 2026 02:28 AM

ఉమా లేని లోటు కనపడుతోందా..? సోషల్ మీడియాలో కొత్త చర్చ..!

దేవినేని ఉమా.. తెలుగుదేశం పార్టీలో ఒక సమయంలో అత్యంత ప్రభావం చూపిన నాయకుల్లో ఒకరు. రాజకీయంగా పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు, అధినేతగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నప్పుడు తోడు నిలబడిన అతి తక్కువ మంది నేతల్లో ఒకరు. తాను నిర్వహించే శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు పెంచుకున్న మంత్రిగా కూడా ఉమాకు గుర్తింపు ఉండేది. కానీ 2024 ఎన్నికల తర్వాత ఉమాను పార్టీ కొంత పక్కన పెట్టింది అనే విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రాధాన్యత దక్కింది.

Also Read : చరిత్ర మర్చిపోతే ఎలా జగన్..!

అయితే ఇప్పుడు ఉమా లేని లోటు కనపడుతోందని పార్టీ క్యాడర్ అంటుంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. నారా కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరుచుకుపడేవారు ఉమా. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అంబటి రాంబాబు చంద్రబాబును ఆ మాట అన్నప్పుడు.. మైలవరం నియోజకవర్గం నుంచి స్పందన కరువైంది. వసంత కృష్ణ ప్రసాద్ కనీసం బయటకు రాలేదు.

ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. దీనితో కార్యకర్తలు ఫైర్ అయిపోతున్నారు. ఉమా లేని లోటు తెలిసిందని, డబ్బుకు నమ్మకానికి ఉన్న తేడా ఇప్పుడు మైలవరం చూస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఉమా విషయంలో ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచన చేసి ఆయనకు న్యాయం చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. డబ్బుల కోసం పాకులాడే వారికి నియోజకవర్గం అప్పగించి నాశనం చేసారని మండిపడుతున్నారు కార్యకర్తలు.

Also Read : స్కిల్ కేసు ముగిసింది.. బాబుకు క్లీన్ చిట్

ఉమా ఉన్నప్పుడు జిల్లాలో ఎన్ని విభేదాలు ఉన్నా బయటకు వచ్చేవి కాదని, నాయకత్వం మొత్తాన్ని ఆయన నడిపించే వారు కొందరు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తప్పులు సహజమే అని ధైర్యం ఉన్న నాయకత్వాన్ని పార్టీ దూరం చేసుకుంటుంది అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక ఉమా విషయంలో జిల్లా నాయకత్వం మొత్తం సైలెంట్ గా ఉండటం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే కనీసం కృష్ణా జిల్లా నాయకులు అడుగుపెట్టలేదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్