Friday, September 18, 2026 01:12 AM
Friday, September 18, 2026 01:12 AM

విద్యార్థుల కోసం సర్కార్ మరో హామీ..!

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాయి. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. త్వరలో తమిళనాడులో కూడా అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం.. మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టింది. కేబినెట్ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా.. వచ్చే ఎన్నికల్లో యువతను మరింత అకర్షించేందుకు కీలక ప్రకటన చేశారు డీకే శివకుమార్.

Also Read : టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు, విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఫ్రీ బస్ పాస్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫ్రీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ప్రకటించారు. విద్యార్థులకు ఫ్రీ బస్ స్కీమ్ ప్రకటించి ఆకట్టుకున్నారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు అవుతోంది. తాజాగా విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు.

Also Read : సామాన్యుడి కోరిక తీర్చనున్న సీఎం..!

కర్ణాటక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే ప్రశంసలు వెల్లువెత్తడంతో.. ఇదే బాటలో నడిచేందుకు తెలంగాణ సర్కార్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలవుతోంది. తాజాగా విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నారు. 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. అలాగే అదనపు బోధన కోసం ప్రత్యేక ట్యూటర్లు కూడా అందుబాటులో ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పిల్లల కోసం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి ప్రకటన చేశారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్