Wednesday, August 5, 2026 06:41 AM
Wednesday, August 5, 2026 06:41 AM

మాటలేనా.. నిజంగా చేతల్లో చూపించే దమ్ముందా?

వైసీపీ అధినేత వైయస్ జగన్ చాలా రోజుల తర్వాత మీడియాలో సందడి చేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి జగన్ 2.0 చూస్తారు అంటూ ఆయన కామెంట్ చేశారు. కార్యకర్తల జోలికి వస్తే తాను ఏం చేస్తానో చూపిస్తానని.. వైసీపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనని ఎవరు ఏం పీకలేరని… వైసీపీ బ్రతుకుతుందని, ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుందని, మళ్లీ ముఖ్యమంత్రి అవుతాను అంటూ జగన్ కామెంట్ చేశారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన్ చేసి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు కదా అన్న వ్యాఖ్యలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

Also Read: ఏపీలో ప్రభుత్వం మారిందా.. లేక..!

ఇక ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో ఒపీనియన్స్ వినపడుతున్నాయి. అయితే వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ కావడంతోనే వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేందుకు జగన్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అరెస్టులతో వైసిపి సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియక చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. కనీసం జగన్ ఫోటో పెట్టుకునేందుకు కూడా భయపడుతున్నారు. దీనితో వైయస్ జగన్ వాళ్ళలో ధైర్యాన్ని నింపేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటివి ఏమీ లేకుండా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడుతున్న సోషల్ మీడియా వ్యక్తుల పై కేసులు నమోదు చేస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.

Also Read: సీఎం చంద్రబాబే.. చీఫ్ మాత్రం పెద్దిరెడ్డి.. చిత్తూరులో వింత…!

ఇక తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసిపి సోషల్ మీడియా ఆఫీస్ కూడా ఓపెన్ చేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఇదే టైంలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మళ్లీ రంగంలోకి దింపాలని.. నేతలకు కూడా ఆయన సూచనలు సలహాలు చేశారు. అందుకే కార్యకర్తలపై జగన్ కొత్తగా ప్రేమ చూపిస్తున్నారని, గతంలో లేనివిధంగా ప్రేమ కనపడుతోందంటూ కొంతమంది ఆశ్చర్య౦ వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మరి ఇప్పుడు అనూహ్యంగా జగన్ వారి పై ప్రేమ చూపించడం మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని పార్టీలు, అధికారం పోయాక మాత్రం కార్యకర్తల జపం చేస్తుంటారు అన్న సెటైర్లు బాగా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్