Friday, May 1, 2026 07:56 AM
Friday, May 1, 2026 07:56 AM

హోటల్స్ బంద్.. నిన్న బెంగళూరు, నేడు ముంబై, రేపు బెజవాడ..?

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. పది రోజుల నుంచి నిర్విరామంగా సాగుతోన్న ఈ యుద్ద ప్రభావం చమురు నిల్వలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై అటు కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉండటం ఒకటి అయితే, కొరత మరింత భయపెడుతోంది. దీనితో కమర్షియల్ సిలెండర్ ల ఉత్పత్తి ఆపేసి.. గృహ అవసరాల కోసం తయారు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

Also Read : ఆఫ్ ది రికార్డు.. కొలికపూడి గురించే..!

ఇప్పుడు ఇదే హోటల్స్ కు శాపంగా మారింది. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్.. నేడు హోటల్స్ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ముంబైలో కూడా దాదాపు అదే పరిస్థితి కనపడుతోంది. గ్యాస్ సరఫరా తగ్గడంతో.. ముంబైలోని దాదాపు 20% హోటళ్ళు, రెస్టారెంట్లు ఇప్పటివరకు మూతపడ్డాయని నగర హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో మరింతగా మూతపడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

Also Read : ఇదేం క్రేజ్ దురంధర్.. రిలీజ్ కు ముందే రికార్డులు..!

రాబోయే రోజుల్లో ముంబైలోని దాదాపు సగం హోటళ్ళు మూసేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక ఈ ప్రభావం క్రమంగా విజయవాడలో కూడా కనపడుతోంది. విజయవాడలో హోటల్ వ్యాపారం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. టిఫిన్ బండ్ల దగ్గరి నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ ల వరకు గ్యాస్ మీదనే ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీటికి గ్యాస్ కొరత ప్రభావం కనపడుతోంది. రాబోయే రోజుల్లో విజయవాడలో కూడా హోటల్స్ మూసేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అటు హార్మోజ్ జల సంధి నుంచి గ్యాస్ రవాణా ఆగిపోవడంమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్