Sunday, September 20, 2026 06:30 AM
Sunday, September 20, 2026 06:30 AM

సంచలనంగా మారిన ఏపీ సచివాలయ అగ్ని ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సచివాలయం రెండో బ్లాక్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సచివాలయం రెండవ బ్లాక్ వద్ద బ్యాటరీ రూమ్ లో ఉదయం 6:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన బ్యాటరీ ప్రదేశానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుని, కారణాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి.

Also Read : హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?

ప్రమాదానికి గల కారణాలను హోం మంత్రి కి జిఎడి పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డి జి మాదిరెడ్డి ప్రతాప్ లు వివరించారు. ప్రమాదం జరిగిన రూంలో ఫైర్ అలారం సిస్టం లేకపోవడం పట్ల హోం మంత్రి అసహనం వ్యక్తం చేసారు. సచివాలయంలోని అన్ని బ్లాక్ లలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాకులు ఈ ప్రమాదం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు అనిత.

Also Read : బ్రేకింగ్: ఏపీ సిఎంవోలో భారీ మార్పులు..?

ఇక ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సచివాలయం కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం.. పూర్తి స్థాయి దర్యాప్తుకు హోమ్ మంత్రి ఆదేశించారు. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ అడిట్ నిర్వహిస్తామని అన్నారు. రెండో బ్లాక్ వద్ద జరిగిన ప్రమాదాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు.. జరిగిన ప్రమాదం తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాన్ని గల కారణాలని సీఎం కి సిఎస్ విజయనంద్.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఫైర్ డీజి మాదిరెడ్డి ప్రతాప్.. జిఎడి సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా… హోమ్ మంత్రి అనిత వివరించారు. ఇక దీనిపై కేసు కూడా నమోదు చేసారు అధికారులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్