Wednesday, August 5, 2026 11:17 AM
Wednesday, August 5, 2026 11:17 AM

రేషన్ బియ్యంలో కీలకంగా కంప్యూటర్.. పేర్ని ఫ్యామిలీ అక్కడే దొరికిపోయిందా..?

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఉత్కంఠ నెలకొంది. నేడు 9వ అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతోంది. సివిల్ సప్లయిస్ కు అద్దెకు ఇచ్చిన గోడౌన్ లో 240 టన్నుల PDS బియ్యాన్ని పక్కదారి పట్టించారని జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు… ఆ దిశగా విచారణ ముమ్మరం చేసారు. ఈ నెల 13న జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు జయసుధ. ఇప్పటి వరకు రెండుసార్లు వాయిదా పడిన బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.

నేడు ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీగా విజయ అనే న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. మరోపక్క రేషన్ బియ్యం మాయంపై లోతుగా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. గోడౌన్ లోని మిగులు నిల్వలను మార్కెట్ యార్డ్ కు తరలించిన అధికారులు… కీలక ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా 243 టన్నుల PDS రైస్ మాయమైనట్టు గుర్తించారు. గోడౌన్ లోని రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి ఆధారంగానే కీలక సాక్ష్యాలు సేకరించారు.

Also Read : టీడీపీలో జోగి మంటలు.. ఇప్పట్లో చల్లారేనా..?

రికార్డులు, కంప్యూటర్లను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు… కంప్యూటర్లో బియ్యం లెక్కలను మార్చినట్టు గుర్తించారు. గౌడాన్ లో ఉండే ఒక కంప్యూటర్ లో… నిల్వలపై తప్పుడు సమాచారాన్ని నమోదు చేసారు. కాని ప్రభుత్వ లెక్కలకు ఆ కంప్యూటర్లో ఉన్న లెక్కలకు మ్యాచ్ కాలేదని అధికారులు భావించారు. ముందు గుడౌన్లో 3708 బస్తాల రేషన్ బియ్యం అంటే 185 టన్నులు మాయం అయ్యాయి అని భావించారు. కాని కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాతనే అసలు విషయం బయటకు వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్