Wednesday, August 5, 2026 10:14 PM
Wednesday, August 5, 2026 10:14 PM

చేవెళ్ళ బస్సు ప్రమాదానికి 9 కారణాలు, మరణాలు అందుకే పెరిగాయా..?

తెలుగు రాష్ట్రాలను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కర్నూలు బస్ ప్రమాదం ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. చేవెళ్ళ – వికారాబాద్ మధ్య ఈ ఘటన జరగగా.. మితిమీరిన వేగంతో వచ్చిన కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

Also Read : నవంబర్ 15.. ముహుర్తం ఫిక్స్..!

స్థానికులు సహాయక చర్యలకు దిగినప్పటికీ, ఘటనాస్థలికి వెంటనే అంబులెన్స్ చేరుకోలేకపోవడంతో అక్కడి స్థానికులే వారి సొంత వాహనాల్లో గాయపడిన వారిని చేవెళ్ళ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బస్సు కంకరలో కూరుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. జేసీబి సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు అధికారులు. ఇక ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారి పోస్టుమార్టం కొనసాగుతోంది.ఇప్పటివరకు మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కర్నాటక భానూర్ కు చెందిన నాగమణి, గంగారం తండాకు చెందిన తారిబాయి, నజీర్ అహ్మద్ మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. ఈ ఘటనలో రోజుల పసికందు మృతి చెందడం కలిచివేసింది. ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్సగ్రేషియా ప్రకటించింది.

Also Read : జోగి.. కేరాఫ్ కులం కార్డు..!

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.

1. ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్.
2. రోడ్డుపై గుంతలు మరియు మలుపు.
3. బస్సును బలంగా ఢీకొట్టిన టిప్పర్.
4. ఢీకొట్టాక బస్సుపై పడిన టిప్పర్.
5. కంకరపై టార్పలిన్ కప్పకపోవడం.
6. ప్రయాణికులపై పడిన కంకర వల్ల మరణాలు పెరగడం.
7. డ్రైవర్ సైడ్ 6 వరుసల్లో సీట్లను చీల్చేసిన టిప్పర్.
8. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం.
9. 54 మందికి ఉండాల్సిన బస్సులో 70 మంది ప్రయాణించడం, దీనివల్ల మరణాలు పెరిగాయని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్