Wednesday, August 5, 2026 03:59 PM
Wednesday, August 5, 2026 03:59 PM

గవాస్కర్ కి అవమానం.. క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. త్రీ – 1 తేడాతో ఐదు టెస్టుల సీరిస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. చివరిదైన సిడ్నీ టెస్ట్ లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీనితో 10 ఏళ్ల తర్వాత ఆ ట్రోఫీని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ ట్రోఫీ ప్రధానం చేసే సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కు అవమానం జరిగింది. ట్రోఫీని ప్రధానం చేసే సమయంలో తనును పిలవకపోవడం పట్ల గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు.

Also Read : తురగా కిషోర్‌ బెండు తీస్తారా..?

విజేత ఆస్ట్రేలియా కు ట్రోఫీని బహుకరించే సమయంలో వేదికపై తాను కూడా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో మైదానంలోనే ఉన్నానని, బాగా ఆడింది కాబట్టి ఆస్ట్రేలియా గెలిచిందని.. అయితే ఏంటి ఈ సీరీస్ బోర్డర్ గవాస్కర్ పేరుతో జరిగింది కాబట్టి తన స్నేహితుడు బోర్డర్ తో కలిసి బహుమతిని ప్రధానం చేస్తే చాలా సంతోషంగా ఉండేవాడిని అన్నారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రియాక్ట్ అయింది. చివరిది అయిన సిడ్నీ టెస్ట్ లో భారత్ గెలిచి ట్రోఫీని తిరిగి దక్కించుకుంటే గవాస్కర్ ను వేదికపైకి పిలిచే వాళ్ళమని పేర్కొంది.

Also Read :విశాఖ కు మోడీ.. ఏపీ కి వరాలిస్తాడా..?

అసలు ఈ విషయం సునీల్ గవాస్కర్ కు కూడా తెలుసు అని పేర్కొంది ఆసీస్. పదేళ్ల తర్వాత ఈ సీరీస్ ను తమ జట్టు సొంతం చేసుకుంది అని అందుకే అలెన్ బోర్డర్ తో తాము ట్రోఫీని ప్రధానం చేయించామని క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చింది. ఇక 1996 – 97 సీజన్ నుంచి ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ గా ఇది కొనసాగుతోంది. ఈ సీరీస్ ఓటమితో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అర్హత కోల్పోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్