Saturday, September 19, 2026 08:16 PM
Saturday, September 19, 2026 08:16 PM

కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు నేతలు

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడీ అవుతున్నారా…? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. త్వరలో క్యాబినెట్లో మార్పులు చేసేందుకు బిజెపి అధిష్టానం కసరత్తు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత పెంచే విధంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉత్తరాదిలో బలహీన పడుతున్న భారతీయ జనతా పార్టీ క్రమంగా దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ లో పాగా వేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది.

Also Read : పవన్ తో భేటీ.. టాలీవుడ్‌లో టెన్షన్..!

రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు భారీగా కేటాయిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది ప్రాంత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత పెంచే విధంగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఇద్దరినీ క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరి కేంద్ర మంత్రులున్నారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

Also Read : కేటిఆర్ మౌనం ఎందుకు…?

ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పటికే దాదాపుగా కేటాయించింది. భారతీయ జనతా పార్టీ నుంచి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అలాగే… బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను కూడా క్యాబినెట్లోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారు ప్రధాని మోడీ. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఈ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్