రాజా సాబ్ వచ్చేశాడు.. రొమాంటిక్ హారర్ కామెడీతో ప్రభాస్

0
140

రెబల్‌స్టార్ ప్రభాస్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు. ‘ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌’గా సోషల్ మీడియాలో రిలీజైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఒక లుక్కేయండి…

ఓ బైక్‌పై కూల్‌గా వచ్చిన ప్రభాస్, దాన్ని అక్కడే ఆపి చేతిలో ఓ బొకే పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. పక్కనే ఉన్న ఓ కారు అద్దంలో చూసుకుని గులాబీ రేకులతో తనకు తాను దిష్టి తీసుకుంటారు. ఎంతో స్టైలిష్‌ లుక్‌లో కనిపించిన ప్రభాస్ అభిమానులని ఆకట్టుకున్నారు. దీంతో గ్లింప్స్ చూసిన అభిమానులు వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫిల్మ్ ‘రాజా సాబ్’. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ చిత్రమిది.

ఇక ఇదే గ్లింప్స్‌లో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్‌, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు ‘ది రాజాసాబ్’ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్స్ ట్రీట్​గా ఉండనుందంటూ మేకర్స్ ఇప్పటికే పలు మార్లు చెప్పారు. మూవీ ఔట్​పుట్‌ సూపర్‌ క్వాలిటీ కోసం అత్యుత్తమ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఎడిటింగ్​​లో ఎక్కువగా VFX ఉపయోగించామని వాటిని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అన్నారు. ఇక ఈ సినిమాతో ఆడియెన్స్​కు​ పవర్​ఫుల్ కంటెంట్ అందిస్తామంటూ నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.