Friday, June 19, 2026 08:36 AM
Friday, June 19, 2026 08:36 AM

మేడం గారు రెబల్.. అర్ధరాత్రి స్కూటిపై.. గంజాయి బ్యాచ్ కు చుక్కలు..!

సాధారణంగా మహిళలు అనగానే రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేందుకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో తిరగడానికి భయమూ ఉంటుంది. కానీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాత్రం బుధవారం సాయంత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. అర్ధ రాత్రి స్కూటీపై గంజాయి బ్యాచ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అసలు మేటర్ ఏంటో ఒకసారి చూస్తే, గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

Also Read : సీఎంఓలో ఆ ఇద్దరు అవుట్..?

వారి కారణంగా ఇబ్బంది పడుతోన్న స్థానిక ప్రజలు.. గత కొన్ని రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా మార్పు లేదు. చివరకు ఓ మహిళ ఎమ్మెల్యే మాధవికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. ఫోన్ వచ్చిన వెంటనే తన స్కూటీపై స్వయంగా ఒక్కరే అక్కడికి వెళ్ళారు. స్వయంగా ఎమ్మెల్యే అక్కడికి రావడం గమనించిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ ఉన్న స్థానిక మహిళలతో ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read : బ్రేకింగ్: పరారీలో సునీల్ నాయక్..!

ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక స్వయంగా ఎమ్మెల్యే అక్కడికి రావడంతో మహిళలు షాక్ అయ్యారు. ఒక్క ఫోన్ కాల్ తో ఎమ్మెల్యే రావడం ఒక ఎత్తు అయితే, రాత్రి సమయంలో స్కూటీపై ఆమె రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అక్కడ కామెంట్స్ వస్తున్నాయి. మేడం రెబల్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయన నివాసంపై కూడా దూకుడుగానే వెళ్ళారు ఎమ్మెల్యే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్