Wednesday, August 5, 2026 03:20 AM
Wednesday, August 5, 2026 03:20 AM

రోడ్డు ప్రమాదాల కట్టడికి వీ టూ వీ టెక్నాలజీ.. కేంద్రం కీలక అడుగు..!

దేశంలో వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపధ్యంలో.. కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలో కేంద్రం 2026 చివరి నాటికి వెహికల్ టూ వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు నెట్‌వర్క్ అవసరం లేకుండా ఒకదానితో ఒకటి నేరుగా కనెక్ట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, ప్రమాదాలను తగ్గించడం దీని లక్ష్యం.

Also Read : వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!

ముఖ్యంగా పార్క్ చేసిన వాహనాలు, వెనుక నుండి వేగంగా వెళ్లే వాహనాల ప్రమాదాలను నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దట్టమైన పొగమంచు సమయంలో పెద్ద ఎత్తున గుంతలు ఉన్నప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి అడుగులు వేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా, వాహనాలు సిగ్నల్‌ లను ఒకదానితో ఒకటి మార్పిడి చేసుకుంటాయి. మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు వార్నింగ్ సిగ్నల్ ఇస్తాయి. రాష్ట్రాల రోడ్డు రవాణా మంత్రులతో జరిగిన వార్షిక సమావేశం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలు బయటపెట్టారు.

Also Read : గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటీ..? గుర్తించటం ఎలా ?

సమావేశంలో ఈ విషయంపై చర్చించామని, ఈ సాంకేతికత త్వరలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉంచినప్పుడు, మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతోన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలు, డ్రైవర్లకు నిద్రమత్తును గుర్తించే వ్యవస్థలు, ప్రయాణీకులకు అత్యవసర పరికరాలు వంటి వాటిని అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో మాత్రమే ఇటువంటి సాంకేతికత ప్రస్తుతం వాడుకలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్