Sunday, September 20, 2026 06:37 AM
Sunday, September 20, 2026 06:37 AM

హెచ్ 1 బీ విషయంలో ట్రంప్ కు షాక్..?

హెచ్ 1 బీ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. లక్ష డాలర్ల ఫీజు పెంచుతూ నిర్ణయం అమలు చేయడంపై అమెరికా సంయుక్త రాష్ట్రాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ అంశంపై కోర్ట్ కు వెళ్ళాయి. ఆస్పత్రులు, యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు విస్తృతంగా ఉపయోగించే ఈ వీసా కార్యక్రమంలో ఎక్కువగా విదేశీ కార్మికులను నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

Also Read : జట్టులోనే పనికిరాని వాడ్ని కెప్టెన్ చేస్తారా..?

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అమలు చేస్తున్న ఈ విధానంపై ఇప్పుడు పలు రాష్ట్రాలు కోర్ట్ కు వెళ్లేందుకు రెడీ అయ్యాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం లేదని మండిపడ్డారు. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికాకు విదేశీ కార్మికుల అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభ మన శ్రామిక శక్తిలో చేరినప్పుడు, అది మన దేశాన్ని ముందుకు నడుపుతోందని, కాలిఫోర్నియాకు ఈ విషయం తెలుసనీ అన్నారు.

Also Read : భారత క్రికెట్ కు పట్టిన దరిద్రం గౌతమ్ గంభీర్

అధ్యక్షుడు చట్ట విరుద్దమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఇతర కీలకమైన సేవలను అందించేవారిపై అనవసరమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక భారాలను సృష్టిస్తుందని విమర్శించారు. కీలక రంగాలలో కార్మిక కొరతను పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 19, 2025న జారీ చేసిన ప్రకటన ద్వారా భారీ ఫీజును పెంచడంపై ఆవేదన వ్యక్తమైంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న నేపధ్యంలో.. చాలా మంది అమెరికా వెళ్ళే ఆలోచన విరమించుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్