Wednesday, August 5, 2026 01:14 PM
Wednesday, August 5, 2026 01:14 PM

జగన్ హెలికాప్టర్ దిగకుండా తిప్పి పంపుతా: పరిటాల సునీత

గత నెల రోజుల నుంచి వైసీపీ తమను టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రంగంలోకి దిగారు. వైసీపీ నేతలకు, ఆ పార్టీ అధిష్టానానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సునీత. జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ను అనంతపురం రాకుండా అడ్డుకునే దమ్ము ధైర్యం రెండూ ఉన్నాయి అంటూ మాట్లాడిన ఆమె.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి ఉంది అని హెచ్చరించారు.

Also Read : కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?

మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారని అన్నారు సునీత. కానీ మాకు చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని వ్యాఖ్యానించారు. గతంలో పరిటాల రవి.. పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారు అని గుర్తు చేసారు. వాహనాలు తనిఖీ చేసి.. 3వాహనాలకే అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు అంటూ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరారు.

Also Read : హమ్మయ్య.. మిథున్ రెడ్డి సేఫ్..!

ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడు అని సునీత మండిపడ్డారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. రాప్తాడు ఇన్ ఛార్జి బీసీకి ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు.. ఎవరూ సహనం కోల్పోవద్దు అని సూచించారు. జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా వచ్చిన పని చూసుకుని వెళ్తే బాగుంటుంది అన్నారు సునీత. రాజకీయాల్లో విలువలు అనే మాట వైసీపీ వర్తించదు అని.. ఆ పార్టీ నాయకులు ఆ మాట మాట్లాడకూడదు అన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్