Monday, June 22, 2026 02:43 PM
Monday, June 22, 2026 02:43 PM

చింతమనేనిపై రాడ్లతో దాడి.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసిపి మూకల హత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగి.. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసిపి అల్లరి మూకలు దాడి చేశాయని టీడీపీ నేతలు చెప్తున్నారు.

Also Read : బడ్జెట్ పై చంద్రబాబు మల్లగుల్లాలు.. అసలేం చేద్దాం…?

చింతమనేని గన్ మ్యాన్ నుంచి గన్ లాక్కుని ఫైర్ చేసే ప్రయత్నం చేసినట్టు స్థానిక నేతలు చెప్తున్నారు. దీనితో సిబ్బంది వెంటనే అలెర్ట్ కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు సమాచారం. దాడిలో స్వయంగా దెందులూరు వైసిపి ఇంచార్జీ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది పాల్గోనట్టు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాత్రి వట్లురు లో ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తున్న చింతమనేని ప్రభాకర్ కార్ కు ఉద్దేశ్య పూర్వకంగా తమ కార్ ను అడ్డు పెట్టీ అబ్బయ్య చౌదరి, అతని అనుచరులు గొడవను సృష్టించినట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు.

Also Read : తులసిబాబు విషయంలో రఘురామ సంచలన వ్యాఖ్యలు..!

ముందుగానే సిద్ధంగా ఉన్న వ్యక్తులతో వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టీ ప్రజలను తప్పు దోవ పెట్టించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టించాలని, తద్వారా రాష్ట్ర అభివృదిని అడ్డుకునేల వైసిపి కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. మేము తలచుకుంటే ఏ ఒక్క వైసిపి నాయకుడు కూడా గ్రామాల్లో తిరగడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

పోల్స్