పుష్ప సినిమా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ లెక్క మారింది. అల్లు అర్జున్ ఏం చేసినా సరే గ్రాండ్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. దీనిపై ఇప్పటివరకు ఎన్నో వార్తలు వచ్చినా సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాపై త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతుంది. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ మూవీ చేసేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు.
Also Read : మీ రెగ్యులర్ డైట్లో అల్లం చేర్చుకుంటే.. ఆ రోగాలకు చెక్
నార్త్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అవ్వడంతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాను డైరెక్ట్ గా బాలీవుడ్ లోనే చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అట్లీకి కూడా బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అక్కడి స్టార్ హీరోలతో అతను హిట్టు కొట్టాడు. కాబట్టి ఈ సినిమాను డైరెక్ట్ గా బాలీవుడ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అటు తమిళంలో కూడా ఈ సినిమాను డైరెక్ట్ గానే రిలీజ్ చేస్తున్నట్టు టాక్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి షూటింగ్ జరగనుంది.
Also Read : తులసిబాబు విషయంలో రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
పుష్ప సినిమా తర్వాత నార్త్ ఇండియాలో బాలీవుడ్ హీరోలతో సమానంగా అల్లు అర్జున్ కు మార్కెట్ క్రియేట్ అయింది. దీనితో దాన్ని కంప్లీట్ గా వాడుకోవాలని అల్లు అర్జున్ టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా కూడా అలాగే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇకనుంచి ఏ సినిమా చేసిన మూడు భాషల్లో చేయాలని స్వయంగా తానే డబ్బింగ్ చెప్పాలని బన్నీ వర్కౌట్ చేస్తున్నాడు.