Wednesday, August 5, 2026 06:41 AM
Wednesday, August 5, 2026 06:41 AM

పంత్ కు ఏమైంది..? 27 కోట్ల ఒత్తిడిలో ఉన్నాడా..?

అంతర్జాతీయ క్రికెట్ లో రిషబ్ పంత్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్ధి ఎవరైనా సరే తన దూకుడుతో చుక్కలు చూపిస్తూ ఉంటాడు పంత్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మైదానాల్లో అతని దూకుడు చాలా సందర్భాల్లో భారత్ కు కలిసి వచ్చింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో పంత్ ఆట తీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. దూకుడుగా ఆడటమే కాకుండా కీపింగ్ లో ప్రత్యర్ధులపై ఒత్తిడి పెంచుతూ ఉంటాడు. టెస్ట్ క్రికెట్ లో మరుపురాని విజయాలను కూడా అందించాడు ఈ యువ ఆటగాడు.

Also Read : బ్యాటింగ్ ఓకే.. బౌలింగ్ పైనే ప్రశ్నలన్నీ

అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ విషయానికి వస్తే.. పంత్ ఆట తీరు దారుణంగా ఉంది. గత ఐపిఎల్ సీజన్లలో అదిరిపోయే ఆట తీరుతో దుమ్ము రేపిన పంత్.. ఈ ఏడాది సీజన్ లో మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. భారీ షాట్ లు ఆడే ఈ ఆటగాడు.. టెస్ట్ క్రికెట్ తరహాలో ఎక్కువగా డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం, షాట్ లు ఆడే బంతులకు కూడా వికెట్ పారేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా ఒక ఆటగాడు ఫాం కోల్పోతే పెద్ద విషయం కాదు గాని.. ఈ ఏడాది పంత్ ను కొన్న ధరే అతని మీద ఒత్తిడి పెంచేసింది అని చెప్పాలి.

Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?

పంత్ ను ఏకంగా 27 కోట్లు ఖర్చు చేసి లక్నో కొనుగోలు చేసింది. బహుసా ఈ ఒత్తిడిలో ఏమైనా పంత్ ఉన్నాడేమో గాని.. అతను మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా అతనికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. కెఎల్ రాహుల్ ను వదులుకుని.. పంత్ కు భారీ ధర పెట్టిన లక్నో యాజమాన్యం, అతని ఆట తీరుతో షాక్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆడటం లేదా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈ సీజన్ లో పంత్ చేసింది కేవలం 128 పరుగులు మాత్రమే. కేవలం ఆరు సిక్సులు 11 ఫోర్లు మాత్రమే కొట్టాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్