Wednesday, August 5, 2026 06:33 AM
Wednesday, August 5, 2026 06:33 AM

ఏపీ పోలీసుల కొత్త అవినీతి.. వైసీపీ అండదండలతో

అవినీతికి ఏదీ కాదు అనర్హం అన్నట్టు మారింది వైసీపీ పాలనలో పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు అవకాశం ఉన్న ప్రతి చోట వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు. ఇక వైసిపి నాయకులతో పాటుగా అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది వైసీపీకి సహకరించే అధికారులు ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేశారనే ఆరోపణలు అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేశాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులు సివిల్ తగాదాల్లో తల దూర్చడంతో పాటుగా భూ కబ్జా వ్యవహారాలను దగ్గర నుండి నడిపించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.

Also Read : కాకాని పై గురి.. గవర్నర్ అనుమతి ఇస్తారా..?

తాజాగా రెండు, మూడు ఆరోపణలు జనాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసు జాగిలాలకు పెట్టే ఆహారంతో పాటుగా వాటిని తరలించే వాహనాల పెట్రోల్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దాదాపు 4200 కిలోమీటర్లు ప్రయాణం చేయకపోయినా సరే దానికి సంబంధించి బిల్లులు పెట్టి సొమ్ములు చేసుకున్నారని వెల్లడించారు. ఇక తాజాగా లాప్ టాప్ లు, కంప్యూటర్లు, ప్రింటర్ల వ్యవహారంలో కూడా అవినీతి గుర్తించారు. పోలీస్ అధికారులకు ఇచ్చే లాప్ టాప్ లు కంప్యూటర్లు ప్రింటర్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read : రజనీకి మరిది తలనొప్పి.. మరో కేసు రెడీ

కింది స్థాయి పోలీసులకు ఇచ్చే కొన్ని కంప్యూటర్లకు సంబంధించి పాత కంప్యూటర్లను కొని కొత్త వాటిగా బిల్లులు పెట్టారని.. అలాగే నాసిరకం కంప్యూటర్లను కొని.. భారీగా బిల్లులు చేయించుకున్నట్టు తెలుస్తోంది. కంప్యూటర్ సెంటర్లతో ఒప్పందం చేసుకుని కొన్ని తయారు చేయించారని గుర్తించినట్టు తెలుస్తోంది. అదే విధంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు వద్ద దాడులు చేసిన సమయంలో వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను, కొన్ని ప్రింటర్లను కెమెరాలను.. పోలీసు అధికారులకు ఇచ్చి వాటితో కూడా బిల్లులు చేసుకున్నారని గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్